సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వైరా నియోజకవర్గ సింగరేణి మండలం మాదారం, పేరేపల్లి, జమాలపల్లి గ్రామాలలో సిపిఐ న్యూ డెమోక్రసీ ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) మండల కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వై.ప్రకాష్ మాట్లాడుతూ గ్యాస్ ధరలు పెంచడం మూలంగా సామాన్య మధ్యతరగతి పేద ప్రజలపై మోయలేని అదనపు భారం పడుతుందని, వంట గ్యాస్ కు 50 రూపాయలు వాణిజ్య గ్యాస్ కు 350 రూపాయలు పెంచి ప్రతిరోజు లక్షలాది రూపాయల భారం పేద ప్రజలపై మోపుతున్నార మండిపడ్డారు. ఇప్పటికే నిత్యం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ విద్యుత్ చార్జీల మూలంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. ములిగే నక్క మీద తాటికాయపడిన చందంగా మోడీ పాలనలో 2014లో 460 రూపాయలు ఉన్న గ్యాస్ ధర 9 సంవత్సరాల కాలంలో 13 సార్లు రేట్లు పెంచి 1250 రూపాయలకు గ్యాస్ బండ ధరను పెంచడం జరిగిందన్నారు. సామాన్య ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు కూడా రద్దుచేసి తన నిజ స్వరూపాన్ని బట్ట బయలు చేసుకున్నారని దీని మూలంగా నిత్యవసరకుల కూడా విపరీతంగా పెరిగి ప్రజల పరిస్థితి జీవించలేని పరిస్థితిలోనికి నెట్టబడతారని, కావున పెంచిన గ్యాస్ ధరలను తగ్గించి సబ్సిడీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో ప్రజలందర్నీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, వై జానకి, బాదావత్ వీరు ఎర్రయ్య, ఆలయం గురువయ్య, గడ్డం వెంకన్న తిరుమలగిరి నరేష్, సురేష్ ఆలయం రాంబాబు, బైరుమల్ల లక్ష్మయ్య, నిదిగొండ సతీష్, శివయ్య నరసింహారావు, కావేటి నాగేశ్వరరావు, బాటయ్య ఆలయం చంద్రయ్య, ధనసరి లక్ష్మి, ఆలయం బుజ్జమ్మ, నాగమణి వెంకటమ్మ, కొండమ్మ శిలుముల లక్ష్మి, రమాదేవి నారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin