సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : స్థానిక సమస్యల తక్షణ పరిష్కారం కోసం రూపొందించిన వాడ వాడ పువ్వాడ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ ప్రారంభించారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని 50వ డివిజన్ రాపర్తి నగర్ లో విస్తృతంగా పర్యటించారు. ఉదయం 6గంటలకే నేరుగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గడపను తట్టి వారి సమస్యలను తెలుసుకొని అక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందుతున్నాయా లేదా అని స్వయంగా పర్యవేక్షించే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలిగిందన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసీ చైర్మన్ లక్ష్మిప్రసన్న, ఉప మేయర్ ఫాతిమా ముక్తార్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పోరేషన్ అధికారులు, విద్యుత్, రెవిన్యూ అధికారులు, కార్పొరేటర్లు, జిల్లా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin