సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ, బహుజన ఉద్యమ సిద్ధాంతకర్త,రాజకీయ వ్యూహకర్త,బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరాం వర్ధంతి ని పురస్కరించుకుని పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్... హాజరై కాన్షీరాం గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫూలే,అంబేద్కర్ సిద్ధాంతాలను సైకిల్ మీద తిరుగుతూ ప్రచారం చేస్తూ బహుజనులలో ఓటు చైతన్యాన్ని పెంచేందుకు వారు తమ ఓటు తమకే వేసుకునే తమకే వేసుకునేందుకు, ఓటును అమ్ముకోకుండా ఉండేందుకు వారిలో చైతన్యం తీసుకు వచ్చేందుకు విస్తృత ప్రచారం చేశారని,ఓట్లు మావి రాజ్యం మీదా! ఇకపై సాగదు ఇకపై సాగదు!! అనే నినాదంతో బహుజనుల్లో రాజకీయ చైతన్యం నింపారని నా బహుజన ప్రజలు పాలకులు కావాలనే నినాదంతో సుమారు 600 కులాలను ఐక్యం చేసిన మహనీయుడని,అంబేద్కర్ నినాదాన్ని భుజాన వేసుకుని.అంబేద్కర్ కలలను నిజం చేసిన ఏకైక వారసుడు కాన్షీరాం అని కొనియాడారు.దేశంలోని అన్ని వ్యవస్థలను నియంత్రించేది ఒక్క రాజకీయ వ్యవస్థేనని,రాజ్యాధికారం ద్వారానే బహుజనుల జీవితాలు బాగుపడుతాయనే ఉదేశ్యంతో 1984 ఏప్రిల్ 14వ తేదీన బహుజన్ సమాజ్ పార్టీని స్థాపంచారని "కులాన్ని నిర్మూలిద్దాం- బహుజన సమాజాన్ని నిర్మిద్దాం" అంటూ దేశవ్యాప్త పర్యటన చేసిన ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం అసెంబ్లీ మహిళా కన్వీనర్ కొల మల్లికా,మాలోత్.వీరు నాయక్,నాగుల రవికుమార్, అనిల్,కుమారి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin