సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హన్మకొండ ప్రెస్ క్లబ్ : పేదల అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుని, వెంచర్లకు అమ్మేస్తుందని, నవ జనశక్తి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మనోజ్ శంకర నెల్లూరు జాతీయ కార్యదర్శి ఇసంపెల్లి వేణు భాస్కరన్ విమర్శించారు. అదే తరహాలో ఖానాపూర్ కోకాపేట భూములను లక్షల కోట్ల రూపాయలకు అమ్మేసిందన్నారు. హనుమకొండ ప్రెస్ క్లబ్ లో నవ జనశక్తి కాంగ్రెస్ అధ్యక్షరాలు జన్ను ప్రమీల బింగి సుధాకర్ k. సురేష్ కలిసి వారు విలేకర్ల తో మాట్లాడారు. మోడి కార్పొరేట్లకు ఉపయోగపడుతున్నాడని, పేదలను పట్టించుకోవడం లేదన్నారు విమర్శించారు. ఎకరాలకు రూ.100 కోట్లకు అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. భవిష్యత్తులో పేదలు పుట్ పాత్ మీద పడుకునే పరిస్థితి వస్తుందన్నారు. పేద వాడికి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నవ జనశక్తి కాంగ్రెస్ ఉంటుందని, అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ రావు మల్టీ నేషనల్ కంపెనీకి రెండు వేల ఎకరాల అసైన్డ్ భూములను అప్పజెప్పిందన్నారు. నవ జనశక్తి కాంగ్రెస్ 40 ఎమ్మెల్యే సీట్లకు పోటీ..... తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నవ జనశక్తి కాంగ్రెస్ 40 ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు జాతీయ కార్యదర్శి ఇసంపెల్లి వేణు భాస్కరన్ మీడియాకు తెలిపారు. వర్ధన్నపేట: ఇసంపెల్లి వేణు భాస్కరన్. పరకాల: జన్ను ప్రమీల. బెల్లంపెల్లి: చైతన్య . వరంగల్ తూర్పు: కోలగాని. సురేష్. మిగతా అసెంబ్లీ సీట్లను హైదరాబాద్ ఆఫీసులో ప్రకటిస్తామన్నారు.
-----------------------
Admin