సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలోని జి, ఎస్, రెడ్డి కాలనీలో నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించిన వినాయక ప్రతిమను సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి ఘన నాధున్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు .కాలనీ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఐకమత్యంతో భక్తి భావంతో నిష్టగా పూజిస్తూ ఆ దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా కురవాలని అన్నారు. అనంతరం మండపం వద్ద నిర్వాహకులు ఎర్పాటు చేసిన అన్న దాన కార్యక్రమంలో పాల్గొని పలువురిని ఆప్యాయంగా పలకరించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు భక్తులు నిర్వహణ కమిటీ పెద్దలు రాకేష్, యల్లయ్య, శ్రీను, సురేష్, సుబ్బారావు , నాగేశ్వరావు, గోపి, విష్ణు ను ములకల సుబ్బారావు, సైదులు తదితరులు....
-----------------------
Admin