సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఈ దీపావళిలో రాష్ట్ర ప్రజలు జీవితాల్లో వెలుగులు విరజిల్లాలని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ఆకాంక్షించారు.దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడారు.చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదిన వేడుకను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని కోరారు.ఇది ప్రధానంగా భారతదేశంలో జరుపుకునే అతిపెద్ద,గొప్ప పండుగలలో ఒకటని చెప్పారు.దీపావళి ఆనందం,విజయంతో పాటు సామరస్యాన్ని గుర్తు చేసే పండుగగా వర్ణించారు. హిందూ పురాణాల ప్రకారం నాడు 14 సంవత్సరాల ప్రవాసం తరువాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడనే విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు.ఈ ప్రవాస కాలంలో అతను రాక్షసులతోనూ,లంక యొక్క శక్తివంత పాలకుడైన రావణ రాజుతో పోరాడాడని తెలిపారు. తిరిగి రాముడు వచ్చినప్పుడు, అయోధ్య ప్రజలు ఆయనను స్వాగతించారని,అతని విజయాన్ని జరుపుకోవడానికి ప్రతీకగా దీపాలు వెలిగించారనేది చరిత్ర చెపుతోందని స్పష్టం చేశారు.అప్పటి నుండి, చెడుపై మంచి విజయాన్ని ప్రకటించడానికి దీపావళి పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు.
-----------------------
Admin