సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు పుట్టపర్తి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ J.జయ నాయక్ కి రాబడిన సమాచారంతో ఈ రోజు అనగా 03.11.2022 వ తేదీ South Africa మరియు Pakistan దేశాల మధ్య T-20 క్రికెట్ మ్యాచ్ జరుగు సమయములో కొత్తచెరువు దర్గా వెనకాల క్రికెట్ బెట్టింగ్ స్థావరం పైన కొత్తచెరువు సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ K.M.లింగన్న మరియు వారి సిబ్బంది దాడి చేసి బెట్టింగ్ నిర్వహిస్తున్న కొత్తచెరువుకు చెందిన నలుగురు ముద్దాయిల ను అరెస్టు చేసి వారి వద్ద Rs. 1,02,250/- (అక్షరాల ఒక లక్ష రెండు వేల రెండు వందల యాభై రూపాయలు) డబ్బులను మరియు నేరము చేయడానికి ఉపయోగించిన Sky Blue Color Vivo టచ్ మొబైల్ ఫోన్ సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిపే వారి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన యెడల వారిపైన కఠినమైన చర్యలు తీసుకొనబడును, అలాగే వారి పేరు వివరములు గోప్యముగా ఉంచబడును. క్రికెట్ బెట్టింగ్ ముద్దాయలను పట్టుకున్న సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ K.M.లింగన్న మరియు సిబ్బంది ప్రతాప్, బాలాజీ మరియు రంజిత్ కుమార్ లను అభినందిచడమైనది.
-----------------------
Admin