సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఈనెల 11వ తేదీన నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభను విజయవంతం చేసిన ప్రతీఒక్కరికీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ధన్యవాదాలు తెలిపారు.గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 30వ తేదీన జరుగు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 11వ తేదీన కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల శంఖారావ సభను,అంతకుముందు ఓల్డ్ బస్ డిపో నుండి కొత్తగూడెం క్లబ్ వరకు నిర్వహించిన ర్యాలీ ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతం అయ్యిందని,సభ సక్సెస్ తో వచ్చేనెల 30న జరిగే ఎన్నికలలో గెలుస్తామనే ధీమా రెట్టింపు అయ్యిందని తెలిపారు.ఈ ర్యాలీ,ఎన్నికల శంఖారావ సభను విజయవంతం చేసిన యువకులకు,మహిళలకు,పార్టీ నాయకులకు,స్వేరోస్ నాయకులకు అన్ని వర్గాల ప్రజలకు,మీడియా ప్రతినిధులకు,పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి,అసెంబ్లీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి నాగుల రవికుమార్,అల్లకొండ శరత్,సందెల సందీప్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin