సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ కు సోమవారం లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అధికఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు.ప్రైవేటు విద్యా సంస్థల వారు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడిన విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల విషయమై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.2009 విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లు ఎస్సీ,ఎస్టీ,బీసీ,దివ్యాంగులకు ఉచిత విద్య అందించాలనే నిబంధనలను ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవి పాటించడం లేదని అన్నారు.ప్రైవేట్ విద్యాసంస్థలలో విద్యార్థులు అడ్మిషన్ నెంబర్ తో కూడిన నోటీస్ బోర్డ్ లో పెట్టాల్సి ఉందని గుర్తు చేశారు.ఈ విషయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ బాధ్యతలు తీసుకొని ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలకు నోటీసులు అందించి,నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటే తప్ప ఈ విద్య దోపిడీని అరికట్టలేమని అన్నారు.రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బ్రష్ఠు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈకార్యక్రమంలో జెట్టి ఆనందరావు,జర్పుల కళ్యాణ్,గూగులోత్ రాహుల్,తుమ్మ వంశీ,నాగేందర్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin