సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సేవాదళ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రారంభించారు. మల్లంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రేస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు వెండి సక్కుబాయి తన కళ్ళు ఆపరేషన్ చేయించుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి వెళ్లి పరామర్శించి,కాంగ్రెస్ సేవాదళ్ కార్యక్రమంలో భాగంగా ఆమెకు 10000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం చుక్క రమేష్ మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశానుసారం సేవాదళ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని,కష్టకాలంలో ఉన్న మండలంలోని ప్రతీ కార్యకర్తకు సహాయం అందించే దిశగా ఈ సేవాదళ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,ఈ సేవాదళ్ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని అన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట AMC డైరెక్టర్ హింగే రామరావు,మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్,యూత్ మండల అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ,మాజీ మండల ప్రధాన కార్యదర్శి ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి,మండల ప్రచార కార్యదర్శి కూరతోట సురేష్,బ్లాక్ కాంగ్రేస్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ,మండల సీనియర్ నాయకులు గన్న ప్రమోద్,దారావత్ రాజు,యార నర్సిరెడ్డి,మట్ట స్వామి యాదవ్,బండారి ప్రకాష్,అకేలి ప్రవీణ్,శంకేసి రమేష్,కానుగుల కుమారస్వామి,కోట నరేష్,కుక్కమూడి రాజు,పొన్నాల మైపాల్,ఇజ్జగిరి నరేష్,మండల కార్యదర్శి జంగిలి రవి,గ్రామ శాఖ అధ్యక్షులు మహ్మద్ సర్వర్,అల్లాపురం ప్రదీప్,ఇట్టబోయిన ఐలయ్య,Nri యశ్వంత్ లు పాల్గొన్నారు.
-----------------------
Reporter