సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎంపీపీ వనజాదత్తు అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల నివేదికలను అధికారులు చదివి వినిపించారు. మాధ్వార్, లింగంపల్లి , కాట్రేవ్ పల్లి గ్రామాలలో గ్రామ పంచాయతీల కోసం నిధులు కేటాయించిన ఇప్పటి వరకు కనీసం ప్రారంభించలేదని వెంటనే ఆదేశాల మేరకు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మక్తల్ నియోజకవర్గం మక్తల్ మండలానికి దాదాపు ఒక కోటి 60 లక్షల రూపాయలతో హెచ్డిఎఫ్సి నిధులు వచ్చాయని, వాటిని త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని తెలిపారు. రైతు జింకల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే జింకలను తరలిస్తామని ఆయన అన్నారు. సంగంబండ రిజర్వాయర్ కు అర టీఎంసీ నీటిని ఎత్తిపోశామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామేశ్వరి, ఎంపీడీవో శ్రీధర్, ఎంపీఓ పావని, అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin