Monday, 27 July 2026 12:41:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అభివృద్ధి పనులల్లో వేగం పెంచాలి. సర్వసభ్య సమావేశంలో అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే చిట్టెం....

Date : 11 July 2023 03:02 AM Views : 527

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎంపీపీ వనజాదత్తు అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల నివేదికలను అధికారులు చదివి వినిపించారు. మాధ్వార్, లింగంపల్లి , కాట్రేవ్ పల్లి గ్రామాలలో గ్రామ పంచాయతీల కోసం నిధులు కేటాయించిన ఇప్పటి వరకు కనీసం ప్రారంభించలేదని వెంటనే ఆదేశాల మేరకు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మక్తల్ నియోజకవర్గం మక్తల్ మండలానికి దాదాపు ఒక కోటి 60 లక్షల రూపాయలతో హెచ్డిఎఫ్సి నిధులు వచ్చాయని, వాటిని త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని తెలిపారు. రైతు జింకల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే జింకలను తరలిస్తామని ఆయన అన్నారు. సంగంబండ రిజర్వాయర్ కు అర టీఎంసీ నీటిని ఎత్తిపోశామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామేశ్వరి, ఎంపీడీవో శ్రీధర్, ఎంపీఓ పావని, అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :