సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి కేంద్రంలో) *నాడు - నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి * నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దు జగనన్న విద్యా కానుక బయోమెట్రిక్ పెండింగ్ లేకుండా క్లియర్ చేయండి వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు ఆదేశించిన పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ .... రెండో దశ మనబడి నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని సమగ్ర శిక్షా కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో రెండవ దశ మనబడి "నాడు-నేడు" పనుల పురోగతి పై పాఠశాలల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తో కలిసి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్లోనే స్పందన వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్ డిఇఓ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ....ప్రభుత్వ పాఠశాలలను ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చే లక్ష్యంతో రెండో విడత మనబడి నాడు-నేడు పనులు చేపడుతున్నామని చెప్పారు. నాణ్యతతో నిర్దేశించి చేసిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడూ ఖర్చులు ఆన్లైన్లో నమోదు చేసేలా ఇంజినీరింగ్ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దన్నారు. ప్రతి పాఠశాలలో గణనీయంగా మార్పులు కనిపించాలని చెప్పారు. ఈ దిశగా అధికారులు బాధ్యతతో పని చేయాలని స్పష్టం చేశారు. నాడు-నేడు సబ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వందశాతం గ్రౌండ్ కావాలన్నారు. జగనన్న విద్యా కానుక సంబంధించి బయోమెట్రిక్ పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలన్నారు. బడి బయట ఉన్న పిల్లలపైన ప్రత్యేక దృష్టి పెట్టి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ....రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మనబడి నాడు-నేడు పనులు నిర్దేశించిన గడువు లోపు పూర్తి చేయాలన్నారు. మనబడి నాడు నేడులో ఎక్స్పెండిచర్ బుక్ చేయని సంబంధిత పాఠశాలల హెడ్ మాస్టర్ లపై చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. పాఠశాల కమిటీ ఆ పాఠశాలలో మరమ్మతులకు గురయ్యాయని గుర్తిస్తే, ఎస్ఎంఎఫ్ కింద మరమ్మతులు చేయించాలని సూచించారు. పనుల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు....
-----------------------
Admin