సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజక వర్గం నందిగాం మండల పరిధిలోని చేగూర్ వెంకమ్మగూడ, బండోనిగుడ, బుగ్గోనిగూడ, వీర్లపల్లి గ్రమాలలో శనివారం పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బిజెపి సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నమో ఆరోగ్యమస్తు కార్యక్రమ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గత వారం రోజులుగా 40 గ్రామాల్లోని ప్రజల నుంచి ముఖ్యంగా వయోజనుల నుంచి విశిష్ట స్పందన లభిస్తుందని అన్నారు. 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు చేగురు, వెంకమ్మగూడ, బండోనిగూడ, బుగ్గోనిగూడ, వీర్లపల్లి గ్రామాల్లో పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న 940 మందికి చికిత్స అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ సింగ్ నాయక్ నందిగామ బిజెపి అధ్యక్షులు సుధాకర్ అప్ప, ఆకుల ప్రదీప్, కృష్ణా రెడ్డి, మల్లేష్ , ప్రశాంత్ శ్రీశైలం, శ్రీనివాస్, కరుణాకర్, యాదేశ్, ప్రవీణ్, కుమార్, శ్రీకాంత్, శివ, సత్యం, ప్రశాంత్, రాజు, శ్రీశైలం, విశ్వనాథం, జంగయ్య, మణెమ్మ, మల్లేష్, యాదయ్య, నందు, మల్లేష్, గోపాల్, నరసింహ, అంజయ్య, జంగయ్య, నరసింహ, సాగర్, నవీన్, సంజీవ, చెన్నకేశవులు, సుధాకర్, మహేందర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin