సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ పరిధి 11వ వార్డులోని బస్తీ దవాఖాన ప్రాంగణంలో *తల్లిపాల వారోత్సవాలు లో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్న ప్రసన్న, మరియు తల్లిపాల వారోత్సవాల ర్యాలీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కౌన్సిలర్ భూక్యా శ్రీనివాస్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా అని జీవితాంతం బిడ్డను పలు వ్యాధుల నుంచి తల్లిపాలు రక్షిస్తాయని చెప్పారు. మనదేశంలో పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు తాగుతున్న పసికందులు కేవలం 4 శాతం మాత్రమేనని ఇదే పురుగున్న బంగ్లాదేశ్లో 92 శాతం అని గుర్తు చేశారు. ప్రపంచంలో తల్లిపాలుకు ప్రత్యామ్నాయం లేదని తల్లిపాలు అత్యంత విశిష్టమైనవన్నారు. బిడ్డకు తల్లిపాలు పడితే అటు బిడ్డ, ఇటు తల్లి, అనేక వ్యాధుల నుంచి విముక్తులవుతారని చెప్పారు, బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి నుంచి వచ్చే మురుపాలు అమృతంతో సమానమని, బిడ్డను భవిష్యత్తులో షుగర్, అధిక బరువు, ఆస్తమా, వంటి రోగాల నుంచి కాపాడుతాయి అని చెప్పారు. తల్లిపాలు బిడ్డ ఎంత ఎక్కువ కాలం తాగితే అంత బాగా తెలివితేటలు వృద్ధి చెందుతాయని వివరించారు, తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ భూక్యా శ్రీనివాస్ , అంగన్వాడి సూపర్వైజర్ సీత, బస్తీ దవాఖాన డాక్టర్ ఎండి అప్రోచ్ ఏఎన్ఎం సుజాత, అంగన్వాడీ టీచర్లు శ్రీదేవి, తులసి బాయ్, రజిత, హెల్పర్లు మీనా, మౌనిక ,కొమరమ్మ, తల్లి పిల్లలు, తల్లులు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin