సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సెప్టెంబర్ 2వ తారీకు శనివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో ప్రి (ముందస్తు) లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి అన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ వారిగ పెండింగ్ లో ఉన్న రాజీపడదగిన క్రిమినల్ కేసులు, ఇ- పెట్టి చాలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను త్వరగ పరిష్కరించుకోవాలని పోలీసు అధికారులకు న్యాయమూర్తి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పివిడి లక్ష్మి, రావి విజయ కుమార్, ఏ పి పి విశ్వశాంతి ,కొత్తగూడెం వన్ టౌన్ ,టూ టౌన్ ,3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ,పాల్వంచ రూరల్, పాల్వంచ టౌన్, సుజాతనగర్, చంద్రుగొండ లక్ష్మీదేవి పల్లి చుంచుపల్లి, జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్లు, న్యాయవాది మెండు రాజమల్లు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది,కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు లైజాన్ ఆఫీసర్ హరి గోపాల్, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin