సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కొత్తూర్ మండల్ : గత ప్రభుత్వాల హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోక నాడు వెలవెలబోయిన గ్రామాలు నేడు తెలంగాణ సర్కార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో కళకళలాడుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని పెంజర్ల, కొడిచర్ల, ఎస్బి పల్లి, సిద్ధాపూర్, వై ఎం తండా, ఇన్మల్ నర్వ గ్రామాల్లో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నాయన్నారు. గ్రామాలు ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. అదే విధంగా వర్షాల కారణంగా ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాయం చేసి, గృహా లక్ష్మీ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. పల్లెబాట కార్యక్రమం ద్వారా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని పరిష్కరించేలా ముందుకు సాగుతామన్నారు.
-----------------------
Admin